IPL 2024 Auction: ఐపీఎల్ అంటే ఇండియా లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న ఒక లీగ్ గా ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ప్రపంచంలో ఏ ఒక్క క్రికెట్ అయిన కూడా ఐపిఎల్ లో కనీసం ఒక్క సీజన్ల లో అయిన ఆడాలని చాలా ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఐపీఎల్ లో కనక ఆడితే వాళ్లకి ఎక్కడ లేని క్రేజ్ తో పాటు వాళ్ల టీమ్ తరుపున ఒక సంవత్సరం పాటు ఆడిన రానంత డబ్బులు ఒక్క ఐపిఎల్ లో 2 నెలల్లోనే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఐపిఎల్ ని ఆడడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే ఐపిఎల్ ఆడుతున్న విదేశీ ప్లేయర్లను సైతం మనదేశంలో ఉన్న అభిమానులు చాలా ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు.ఇండియా లో వాళ్ళు క్రేజ్ సంపాదించుకోవడానికి ఐపిఎల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది.ఇక ఇప్పటికే కెన్ విలియమ్ సన్ లాంటి ప్లేయర్లను భారతీయులు అందులోనూ హైదరాబాద్ అభిమానులు మాత్రం కేన్ మవా అంటూ ముద్దుగా పిలుచుకుంటూ అతన్ని విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు…ఇక ఐపిఎల్ అనేది భారీ రేంజ్ లో సక్సెస్ అయింది అందుకే ప్రపంచంలోనే ఈ లీగ్ కి అంత క్రేజ్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధికంగా ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన టాప్ 5 ప్లేయర్స్ ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
ముందుగా ఈరోజు జరిగిన వేలం లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన పాట్ కమీన్స్ ఐపిఎల్ హిస్టరీలోనే అత్యంత విలువైన ఆటగాడుగా గుర్తింపు పొందాడు. ఏకంగా 20 కోట్ల 50 లక్షలకు హైదరాబాద్ టీమ్ తనని కొనుగోలు చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…
2023 వ సంవత్సరంలో జరిగిన మెగా వేలంలో ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన సామ్ కరణ్ ని 18 కోట్ల 50 లక్షలకు పంజాబ్ టీం కొనుగోలు చేసింది. ప్రస్తుతానికి తన రికార్డును బ్రేక్ చేసి ప్యాట్ కమ్మిన్స్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు…
ఇక 2023 వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియా కు చెందిన కెమరన్ గ్రీన్ ని ముంబై ఇండియన్స్ టీం 17 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది..
ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీం కూడా బెన్ స్టోక్స్ ని 16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం…
అలాగే సౌతాఫ్రికా ప్లేయర్ అయిన క్రిస్ మోర్రిస్ ని 2021 వ సంవత్సరంలో రాజస్థాన్ రాయల్స్ 16 కోట్ల 25 లక్షల కొనుగోలు చేసింది…
ఇక ప్రస్తుతానికైతే ఐపీల్ హిస్టరీలో అత్యంత ఎక్కువ డబ్బులను పెట్టి కొనుగోలు చేసిన ప్లేయర్ల లో వీళ్లు టాప్ 5 లో నిలిచారు…