Homeక్రీడలుVaibhav Suryavanshi 97 runs : 29 బంతుల్లో 97.. పాపం వైభవ్.. క్రిస్ గేల్...

Vaibhav Suryavanshi 97 runs : 29 బంతుల్లో 97.. పాపం వైభవ్.. క్రిస్ గేల్ రికార్డ్ తృటిలో మిస్.. ఇంత దురదృష్టమా?

Vaibhav Suryavanshi 97 runs : రాజస్థాన్ జట్టుతో ప్లే ఆఫ్ మ్యాచ్ కు ముందు హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్య వంశీ గురించి ఫోకస్ పెట్టినట్టు వెల్లడించాడు. అతడిని అవుట్ చేయడానికి అనేక రకాల ప్రణాళికలు రూపొందించినట్టు వివరించాడు. కానీ అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. చివరికి అతడి బౌలింగ్ లో కూడా వైభవ్ సూర్య వంశీ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో సునామి కళ్ళ ముందు ఉండేలా చేశాడు. […]

Vaibhav Suryavanshi 97 runs : రాజస్థాన్ జట్టుతో ప్లే ఆఫ్ మ్యాచ్ కు ముందు హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్య వంశీ గురించి ఫోకస్ పెట్టినట్టు వెల్లడించాడు. అతడిని అవుట్ చేయడానికి అనేక రకాల ప్రణాళికలు రూపొందించినట్టు వివరించాడు. కానీ అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. చివరికి అతడి బౌలింగ్ లో కూడా వైభవ్ సూర్య వంశీ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో సునామి కళ్ళ ముందు ఉండేలా చేశాడు. కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు.. 5 ఫోర్ ల సహాయంతో 97 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడు అనుకుంటున్న క్రమంలో అతడు ప్రపుల్ హింగే బౌలింగ్ లో భారీ షాట్ కొట్టాడు.. ఆ బంతిని మలింగ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో 97 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అతడి దూకుడు వల్ల రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 8 ఓవర్లలోనే.. 125 పరుగులు చేయడం విశేషం.

ఐపీఎల్ లో అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా గేల్ పేరు మీద రికార్డు ఉంది. అతడు 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి రికార్డును ఇంతవరకు ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేదు. అయితే సూర్య వంశీ 29 బంతుల్లోనే సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అతడు భారీ షాట్ కు ప్రయత్నించడంతో క్యాచ్ అవుట్ అయ్యాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ యూనివర్సల్ బాస్ గేల్ రికార్డును సూర్య వంశీ బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. 2012 సీజన్లో గేల్ 59 సిక్సర్లు కొట్టాడు. అయితే వైభవ్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 14 సంవత్సరాలుగా రికార్డును 15 సంవత్సరాల చిచ్చరపిడుగు సూర్య వంశీ చెరిపేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి.. కేవలం 16 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 29 బంతుల్లోనే సూర్య వంశీ ఐదు ఫోర్లు.. 12 సిక్సర్లు కొట్టడం విశేషం.. కేవలం బౌండరీల ద్వారానే అతడు 92 పరుగులు సాధించాడు. దీనిని బట్టి అతడి బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ జట్టు మీద గత మ్యాచ్లో సూర్య వంశీ సెంచరీ చేశాడు.. అంతకుముందు మ్యాచ్ లో అంతగా ఆకట్టుకోలేదు. అయితే హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో రాజస్థాన్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ప్రస్తుత మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు దారుణంగా పరుగులు ఇస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అది ఎంత తప్పో సూర్య వంశీ తన బ్యాటింగ్ ద్వారా నిరూపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper