Rohit Sharma: ముంబై జట్టును రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ఐదు సార్లు విజేతగా నిలిపాడు. అటువంటి అతని నాయకత్వాన్ని ముంబై యాజమాన్యం ఈసారి కొనసాగించలేదు. ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ పాండ్యా కు పగ్గాలు ఇచ్చింది. వాస్తవానికి గత సీజన్లోనూ ముంబై జట్టు ఆట తీరు ఏమంత గొప్పగా లేదు. ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆ జట్టు.. తన స్థాయికి తగ్గట్టుగా ఆట తీరు ప్రదర్శించలేదు. అయితే దీనంతటికీ కారణం రోహిత్ శర్మ నాయకత్వలేమి అని భావించిన ముంబై యాజమాన్యం.. అతడిని కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టింది. హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించింది. ఇక అప్పటినుంచి ముంబై జట్టు వైఫల్యాల పరంపర ప్రారంభమైంది. జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు.. పేలవమైన ఆట తీరు ముంబై జట్టు పరువు తీశాయి. వరుసగా మ్యాచులు ఓడిపోవడంతో.. ప్లే ఆఫ్ రేసు నుంచి ముంబై బయటికి వచ్చేసింది.
ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు లేకపోవడంతో.. చివరి మ్యాచ్లలోనైనా గెలిచి గౌరవంగా టోర్నీ నుంచి నిష్క్రమించాలని ముంబై జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై జట్టు 9వ స్థానానికి చేరుకుంది. మిగతా మ్యాచులు ఇలా వరుసగా గెలిచినా ముంబై జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు లేవు.. ముంబై విజయం సాధించడం పట్ల ఆ జట్టు అభిమానులు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. గెలవాల్సినప్పుడు గెలవకుండా.. తీరా ఇంటికి వెళ్లే సమయంలో ఏం ప్రయోజనమని మండిపడుతున్నారు.
హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ కేవలం నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు. నిర్లక్ష్యంగా షాట్ ఆడి కమిన్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్ లో రోహిత్ శర్మ అవుట్ కావడం ఇది నాలుగోసారి. ప్రస్తుత ఐపీఎల్ లో ఫస్ట్ ఆఫ్ లో తొలి ఏడు ఇన్నింగ్స్ లలో రోహిత్ శర్మ 297 రన్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై 49, చెన్నై పై 105 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అయితే తర్వాత ఐదు మ్యాచ్లలో అతడు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు. కేవలం 34 రన్స్ మాత్రమే చేశాడు. ఇక సోమవారం రాత్రి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగులకే అవుట్ కావడంతో.. రోహిత్ ఒక్కసారిగా నిరాశ చెందాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ముభావంగా కనిపించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ప్రపంచ కప్ ముందు రోహిత్ శర్మ ఇలాంటి ఆట తీరు ప్రదర్శించడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై ఓటమిపాలైంది. గత ఏడాది మన దేశం వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ లోనూ ఆస్ట్రేలియా ముందు తలవంచింది. ఇవన్నీ కూడా రోహిత్ శర్మ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో తన కెరియర్లో చివరి t20 వరల్డ్ కప్ ఆడుతున్న రోహిత్ శర్మ.. తన పూర్వపు ఫామ్ దొరకబుచ్చుకొని ఆడాలని.. టీమిండియా కు టి20 వరల్డ్ కప్ తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc
— Gaurav (@Melbourne__82) May 6, 2024