Homeక్రీడలుIndia Vs England Semi Final 2024: రిషబ్ పంత్ తో మామూలుగా ఉండదు మరి.....

India Vs England Semi Final 2024: రిషబ్ పంత్ తో మామూలుగా ఉండదు మరి.. అవాక్కైన మొయిన్ అలీ.. వైరల్ వీడియో

India Vs England Semi Final 2024: టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం వెస్టిండీస్ లోని గయానా వేదికగా జరిగిన రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 171 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 57, సూర్య కుమార్ యాదవ్ 47, హార్దిక్ పాండ్యా 23, రవీంద్ర జడేజా 17 పరుగులు చేశారు.. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది..బ్రూక్ 25, బట్లర్ 23 పరుగులతో టాప్ స్కోరర్ లు గా నిలిచారు. కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

పలుమార్లు వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. రిజర్వ్ డే లేకపోవడంతో అంపైర్లు ఆలస్యమైనా సరే మ్యాచ్ నిర్వహణకే మొగ్గు చూపించారు.. అయితే వర్షం కురిసిన నేపథ్యంలో.. మైదానంపై ఉన్న కాస్త తేమను భారత స్పిన్నర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. పవర్ ప్లే లో కీలక వికెట్లు పడగొట్టి.. మ్యాచ్ పై పట్టు సాధించారు. ఇంగ్లాండ్ జట్టు లో కీలకమైన ఆరు వికెట్లను అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ దక్కించుకున్నారంటే.. వారి బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో మొయిన్ అలీ వికెట్ కోల్పోయిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది.

అప్పటికే ఇంగ్లాండ్ జట్టు ఫిలిప్ సాల్ట్, బట్లర్, జానీ బెయిర్ స్టో వికెట్లను కోల్పోయింది. అప్పటికి ఆ జట్టు స్కోర్ 7 ఓవర్లు పూర్తయ్యే సరికి 46 పరుగులు.. క్రీజ్ లో మొయిన్ అలీ, సామ్ కరణ్ ఉన్నారు. ఈ దశలో బంతిని అక్షర్ పటేల్ అందుకున్నాడు. స్ట్రైకర్ గా మొయిన్ అలీ ఉన్నాడు. అప్పటికే అతడు తొమ్మిది బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేశాడు. ఈ దశలో అక్షర్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి ముందుకు వచ్చాడు. అది కాస్త అతడి ప్యాడ్ కు తగిలింది. క్రికెట్ల వెనుక ఉన్న రిషబ్ పంత్ ఒక్క ఉదుటున ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి.. బంతితో స్టంప్స్ ను గిరాటేశాడు. అలీ బ్యాట్ క్రీజ్ లో పెట్టేలోపే.. చేయాల్సిన నష్టం చేసేసాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ వేగంగా వచ్చి స్టంప్ ను గిరాటేయడంతో బిత్తరపోవడం మొయిన్ అలీ వంతయింది.. ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper