IND Vs ENG: రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు అన్ని రంగాల్లో ఇంగ్లీష్ జట్టు పై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా చెన్నై వెళ్లిపోయినప్పటికీ ఆ ప్రభావం జట్టు బౌలింగ్ మీద పడకుండా కెప్టెన్ రోహిత్ శర్మ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫలితంగా రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ మూడవరోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మరో 112 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. శుక్రవారం సెంచరీ సాధించిన డక్కెట్ శనివారం కూడా అదే దూకుడు కొనసాగించాడు. శనివారం ఉదయం తొలి సెషన్ వరకు 153 పరుగులు చేసి కులదీప్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. మిగతా బ్యాటర్ లలో రూట్(41) మినహా మిగతా వారెవరూ ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా ఇంగ్లాండ్ 319 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు తీసుకున్నాడు. కుల దీప్, జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా, అశ్విన్ చెరో దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా కు అదిరిపోయే ఆరంభమేమీ దక్కలేదు. 30 పరుగులకే రోహిత్ శర్మ రూపంలో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ అనంతరం వన్ టౌన్ బ్యాట్స్మెన్ గా గిల్ క్రీజ్ లోకి వచ్చాడు. అప్పటికి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ గిల్ తో కలిసి ఇండియా ఇన్నింగ్స్ చక్కదిద్దె ప్రయత్నం చేశారు. ఇలా వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. విదే క్రమంలో జైస్వాల్ హాఫ్ సెంచరీ, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జై స్వాల్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. 104 పరుగుల వద్ద జై స్వాల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. గిల్ 120 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ ల సహాయంతో 65 పరుగులు చేశాడు. అతనితోపాటు రజిత్ పాటిదార్ క్రీజ్ లో ఉన్నాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 322 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.
ఇంగ్లాండ్ జట్టులో జో రూట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఉదయం బౌలర్లకు సహకరించిన మైదానం సాయంత్రం వరకు బ్యాటర్లకు అనుకూలంగా మారింది. ముఖ్యంగా గిల్, జై స్వాల్ 161 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గిల్, జై స్వాల్ ను విడదీయడానికి స్టో క్స్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అండర్సన్, రూట్, హర్ట్ లీ, వుడ్, అహ్మద్ వంటి బౌలర్లను స్టోక్స్ భారత బ్యాటర్ల మీదికి ప్రయోగించాడు. వీరిలో రూట్ ఒక్కడే ఒక వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇండియా చేతిలోనే మ్యాచ్ ఉన్నట్టు కనిపిస్తోంది