Ind vs Eng 3rd Test: రాజ్కోట్ వేదికగా ప్రారంభమైన ఇంగ్లండ్, భారత్ టెస్టు మ్యాచ్ రెండో రోజు ప్రారంభమైంది. మొదటి రోజు రోహిత్, జడేజా సెంచరీలు చేయడంతో భారీ స్కోరు చేసింది టీమిండియా రెండో రోజు ఓవర్నైట్ స్కోర్ 326/5తో ఆట మొదలు పెట్టిన భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
స్వల్ప వ్యవధిలో..
ఓవర్నైట్ బ్యాట్స్మెన్లు కుల్దీప్యాదవ్(4), నిన్నటి స్కోర్కు మరో మూడు పరిగులు జోడించి అవుట్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో కుల్దీప్ ఔట్ అయ్యాడు. ఇక సెంచరీ వీరుడు రవీంద్రజడేజా(112) కూడా నిన్నటి స్కోర్కు మరో రెండు పరుగుల మాత్రమే జోడించి వెనుదిరిగాడు. జో రూట్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పనెవిలియన్ చేరుకున్నాడు. దీంతో బారత్ 331 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
లంచ్ సమయానికి..
ఇక రెండో రోజు లంచ్ సమయానికి భారత్ 388/7 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో అశ్విన్(25), ధృవ్ జురెల్(31) ఉన్నారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. మరోవికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ పరుగులు చేస్తున్నారు. తొలి సెషన్లో చివరి 5 ఓవర్లలో కేవలం 14 పరుగులే వచ్చాయి.
అశ్విన్కు పెనాల్టీ..
ఇక మ్యాచ్లో అశ్విన్కు ఎంపైర్ పెనాల్టీ విధించాడు. 101.3వ ఓవర్ వద్ద అశ్విన్ పిచ్ మధ్యలో పరిగెత్తాడు. దీంతో అంపైర్ 5 రన్స్ పెనాల్టీ విధించాడు. దీంతో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ 5/0 నుంచి ప్రారంభిస్తుంది.