Homeక్రీడలుIndia vs New Zealand : వరల్డ్ కప్ సెమీస్ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్......

India vs New Zealand : వరల్డ్ కప్ సెమీస్ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్… ఎవరి బలమెంత? గెలుపెవరిది..?

India vs New Zealand : ప్రపంచ దేశాల క్రికెట్ టీమ్ లు అన్నింటిని దాటుకొని ఒక టీమ్ కప్పు కొట్టాలి అంటే ఆ టీమ్ కి ఎంత దమ్ము ఉండాలి. ఓడిపోయినప్పుడు ప్రపంచం మొత్తం హేళన చేస్తుంది,చివాట్లు, ఛీత్కరాలు, విమర్శలు చాలా ఎదురు అవుతాయి వాటన్నిటినీ దాటుకుని దైర్యం గా ముందు అడుగు వేసినపుడే విజయం అనేది మనల్ని వరిస్తుంది…గెలుపు కోసం ఎదురు చూడకుండా చేసే పోరాటం లోనే విజయం దక్కుతుంది…ప్రస్తుతం ఇండియన్ టీమ్ కూడా పోరాటం చేస్తుంది అది అలాంటి ఇలాంటి పోరాటం కాదు నిప్పులా కొలిమి లో కాలుతున్న కత్తి ని చూసి కాలిపోతుంది అంటూ హేళన చేసిన వాళ్ళకి తెలీదు అది కాలితేనే కత్తి అవుతుందని…ప్రస్తుతం ఇండియన్ టీమ్ కూడా కత్తిలా కాలుతుంది కానీ కప్పు కొట్టిన తర్వాత తెలుస్తుంది అది నిప్పులో కాలిపోవడానికి కర్ర కాదు కత్తి అని…

ఇప్పటికే సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం రెండు టీంలు భారీ ఎత్తున సిద్ధమవుతున్న క్రమంలో ఇండియన్ టీం ని మాత్రం చాలా రకాల భయాలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా వరల్డ్ కప్ లో 2019 నాటి సీన్ మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందా ఏంటి అనేది అభిమానుల్లో కూడా కొద్దిపాటి కలవరాన్ని కలిగిస్తుంది. ఎందుకు అంటే ఇండియన్ టీం చాలా సార్లు నాకౌట్ మ్యాచ్ లో తడబడుతు వస్తుంది అనే విషయం మీదనే ఇప్పుడు చాలా మంది చాలా రకాల చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ టీమ్ మీదనే ఇండియన్ టీం నాకౌట్ మ్యాచ్ లో తడబడుతు వస్తుంది.

ఇక ఇంతకుముందు కూడా న్యూజిలాండ్ మీద ఇండియన్ టీం మూడుసార్లు తడబడింది. ముందుగా 2000 సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో ఇండియా న్యూజిలాండ్ మీద భారీ ఓటమిని చవి చూసింది.ఇక ఇండియన్ టీమ్ మాత్రం అలా ఓడిపోవడాన్ని ప్లేయర్లతో సహా అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇక దీని తర్వాత 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో చివరి వరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇక 2021 వ సంవత్సరంలో డబ్ల్యూటీసి ఫైనల్ లో కూడా ఇండియన్ టీం న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాభావాన్ని చవిచూసింది. ఇక వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఇండియన్ టీమ్ పరిస్థితి ఏంటి అనే దానిమీద చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొంతమంది ఇండియా ఈ మ్యాచ్ లో గెలవడం కష్టమే అంటుంటే మరికొందరు మాత్రం ఇండియన్ టీం ఉన్న ఫామ్ కి న్యూజిలాండ్ టీంని చిత్తు చేస్తుంది. ఎప్పుడో ఏదో జరిగింది అని ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది అంటూ ఘాటుగా సమాధానం చెబుతున్నారు. ఇక దీని మీదనే సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజుల నుంచి ఒకటే చర్చ నడుస్తుంది…

ఇక న్యూజిలాండ్ టీం కూడా ప్రస్తుతం ఇండియన్ టీమ్ ఆడుతున్న ఫామ్ ని చూసి వాళ్ళలో కూడా భయం కలుగుతుంది. ఎందుకంటే లీగ్ దశలోనే ఇప్పటికే ఇండియన్ టీం చేతిలో న్యూజిలాండ్ టీమ్ చిత్తు గా ఓడిపోయింది.అయితే వాళ్లకు కూడా తెలియని ఒక భయం వాళ్ళని వెంటాడుతూ ఉందని తెలుస్తుంది ఇక ఇప్పటివరకు వరల్డ్ కప్ హిస్టరీలో 9 సార్లు సెమీఫైనల్ కి వచ్చిన టీమ్ గా న్యూజిలాండ్ ఒక రికార్డుని క్రియేట్ చేసింది.అన్ని సార్లు సెమీస్ కి వచ్చిన కూడా న్యూజిలాండ్ టీమ్ కి ఇప్పటివరకు కప్పు రాకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అనే చెప్పాలి…

అయితే నవంబర్ 15వ తేదీన ఈ భీకర పోరు కి సర్వం సిద్ధమైన సమయంలో ఎవరు ఎవరిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తారు అనేది చూడడానికి ప్రతి ప్రేక్షకులు కూడా వేయి కన్నులతో ఎదురుచూస్తున్నాడు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ మ్యాచ్ కోసం ఎదురుచూడని జనం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే ఈ మ్యాచ్ ఎంత కీలకమైందో మనం అర్థం చేసుకోవచ్చు…

ఇక ముంబైలోని వాంఖడే పిచ్ కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగని ఈ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుందని చెప్పలేం మొదట బ్యాటింగ్ కి అనుకూలించి కొద్ది ఓవర్లు గడిచిన తర్వాత బౌలింగ్ కి కూడా చాలా బాగా అనుకూలించే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక వీటన్నింటిని దృష్టి లో పెట్టుకొని మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది….

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular