మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దానితో సిబిఐ దర్యాప్తు జరుగకుండా తీవ్రంగా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిన్నట్లు అయింది. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత పిటిషన్లను కోర్టు విచారించింది. మొత్తం నాలుగు పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హత్య జరిగి ఏడాది అవుతున్నా దర్యాప్తులో పురోగతి లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
కాగా, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ దరీఫతు కోర్టు కోర్టుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిటిషన్ ఉపసంహరించుకున్న ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. కడప జిల్లాలోని పులివెందుల నుంచి దర్యాప్తు ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది.
ఏడాది పాటు సిట్ విచారణ జరిపినా ఏమీ తేల్చలేకపోయిందని కోర్టు పేర్కొంది. కేసులో అంతర్రాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 2019, మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం విదితమే.
జగన్ ప్రభుత్వం పలుసార్లు దర్యాప్తు చేస్తున్న అధికారులు మారుస్తూ రావడంతో స్వయంగా వివేకానంద రెడ్డి భార్య, కుమార్తె దర్యాప్తు జరుగుతున్న తీరుపట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డికి రాజశేఖరరెడ్డి స్వయంగా తమ్ముడు. గతంలో కడప ఎంపీగా, పులివెందుల ఎమ్యెల్యేగా పనిచేశారు.