Homeజాతీయ వార్తలుబస్టాండులలో జనాల సందడి!

బస్టాండులలో జనాల సందడి!

MGBS Hyderabad

రాష్ట్రంలో లాక్‌ డౌన్ విధించడంతో సుమారు రెండు నెలలు బోసిపోయిన బస్టాండులు ఇప్పుడు ప్రయాణికుల రాకపోకలతో సందడిగా మారాయి. రాజధానిలో లాక్‌ డౌన్ నిబంధనల్లో భాగంగా అంతరాష్ట్ర బస్సుసర్వీసులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం బస్సులను బస్టాండ్‌ లోకి అనుమతించలేదు. వాటిని శివారు ప్రాంతాలైన హయత్‌ నగర్, ఉప్పల్, ఆరాంఘర్ చౌరస్తాల వరకు మాత్రమే పరిమితం చేసింది. దాంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆటోలను ,క్యాబ్‌ లను ఆశ్రయించి శివారు ప్రాంతాలకు చేరుకునే సరికి వారు ప్రయాణికుల వద్ద నుంచి బస్సుచార్జీలకు మూడింతలు వసూలు చేసేవారు. అయితే నిబంధనల సడిలింపులో భాగంగా బస్సులను బస్డాండ్‌ లలోకి అనుమతించడమే కాకుండా రాత్రి పూట కూడా బస్సులు తిరిగేందుకు ప్రభుత్వం నిబంధనల్లో సడలింపు ఇచ్చింది.

రాత్రి పూట కూడా బస్సులను తిరిగేందుకు అనుమతించడంతో పాటు ఆటోలు, క్యాబ్‌ లకు నిబంధనల నుంచి మినహయింపు ఇవ్వడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు వెళ్ళి బస్సులు ఎక్కాలన్నా, అక్కడ నుంచి తిరిగి సిటీలో గమ్యస్థానాలకు చేరుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారమని అంతే కాకుండా ఆటోలు,క్యాబ్‌లు కూడా పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేసేవని తెలిపారు.అంతే కాకుండా వేసవిలో పదిగంటల నుంచి ఎండలు మండిపోతున్నాయని. దాంతో పాటు రాత్రి 7 దాటితో బస్సులు తిరగక పోవడంతో ప్రయాణాలు వాయిదా వేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం నిబంధనల సడలింపుల్లో భాగంగా రాత్రి సమయంలో కూడా బస్సులు తిరిగేందుకు అనుమతి ఇవ్వడంతో వేసవి తీవ్రతను తట్టుకునేందుకు తాము రాత్రి ప్రయాణాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular