CM Jagan : పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్ తో వైసీపీ ఎలా భయపడుతుందనడానికి ఈరోజు జరుగుతున్న వికృత చేష్టలే నిదర్శనం. చంద్రబాబును జైల్లో పరామర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన ఒక మాస్టర్ స్టెప్ గా అభివర్ణించవచ్చు. ఏదైతే జగన్ జరుగకూడదని అనుకున్నారో.. అదే జరిగింది. కలలో కూడా జరగకూడదని భావించారో అదే జరిగింది. ఇది జగన్ కు నిద్రపట్టని రాత్రుళ్లు సృష్టించింది.
ఇన్నాళ్లు జగన్ విజయం నల్లేరు మీద నడక అనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ ఓటమి భయం పట్టుకుంది. ఏం చేయాలో తెలియక వికృత చేష్టలకు దిగుతున్నారు. ముందుగా తనకు అనుకూలంగా ఉన్న కాపు నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు.
టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నది ఒక పెద్ద తప్పు చేశాడని.. కాపులు పవన్ కు ఓటు వేయవద్దన్న భావనను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో జగన్ ఈ కాపు నేతలతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి పవన్ లో కాపుల్లో మేధోమథనం జరుగుతోంది.
ఇప్పటికే టీడీపీతో పొత్తుపై ఇప్పటం సభలోనే పవన్ హింట్ ఇచ్చాడు. ఇప్పటికే తన శ్రేణులకు ప్రజలకు వివరించారు. దీంతో జగన్ దీనిపై ఎన్ని ఎత్తులు వేసినా పారలేదు.
జగన్ కుల చిచ్చులు, అబద్దపు ప్రచారాలు భయంతో చేసే వికృత చేష్టలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ys jagan is worried about janasena tdp alliance
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com