Tamil Nadu Politics : తమిళనాట అన్నామలై బీజేపీని గట్టెక్కించబోతున్నాడా? అందరి మనసులో ఉన్న ఆలోచన ఇదీ. 200 నియోజకవర్గాలు ఇప్పటికీ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు చెన్నై నగరంలో పాదయాత్ర చేయకుండా సదస్సులు నిర్వహిస్తున్నాడు. వివిధ వర్గాలు, ఇతర రాష్ట్రాల వారితో మమేకం కావాలని నిర్ణయించాడు.
16,17,18 తేదీల్లో మున్సిపాలిటీ లెవల్ వరకూ బీజేపీ నేతల కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఈ మీటింగ్ కు హాజరై 19 నుంచి తిరిగి అన్నామలై పాదయాత్ర మొదలవుతుంది. చివరకు మోడీ మహాసభతో ఈ పాదయాత్రను ముగించనున్నారు.
అన్నామలైకి ప్రధానంగా రెండు అడ్డంకులు ఉన్నాయి. అన్నామలై పాదయాత్రకు వచ్చిన విశేష స్పందన ఓట్లుగా కన్వర్ట్ అవుతుందా? రెండోది పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? అన్నది తేలాల్సి ఉంది. దీనికి టైం పడుతుంది. ప్రస్తుతం తమిళనాట సనాతన ధర్మం కీరోల్ పోషిస్తోంది.
తమిళనాట బీజేపీకి అగ్నిపరీక్షగా మారిన సనాతన ధర్మ పోరాటంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.