ఆంధ్రప్రదేశ్‌Pawankalyan - TDP Alliance : టీడీపీతో పొత్తుపై తేల్చేసిన పవన్.. సీఎంగా సిద్ధం

Pawankalyan – TDP Alliance : టీడీపీతో పొత్తుపై తేల్చేసిన పవన్.. సీఎంగా సిద్ధం

Pawankalyan – TDP Alliance : జనసేనాని పవన్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వ్యూహాత్మకంగా, ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటున్నారు. పొత్తులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై కూడా అచీతూచీ మాట్లాడుతున్నారు. ఎక్కడా తొందరపాటు ప్రదర్శించడం లేదు.పరిణితి ప్రదర్శిస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీతో పొత్తు, బీజేపీ కలిసి రావడంపై కూడా భిన్న ఆలోచనలతో ఉన్నారు. వారాహి యాత్రలో ఉన్న ఆయన వివిధ మీడియా సంస్థలకు ఇంట్వర్వ్యూలు ఇచ్చారు. ఎన్నికల్లో పొత్తులపై మాట్లాడుతూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదన్నదే తన అభిమతమన్నారు. అలా చెబుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సైతం పోటీచేస్తామని చెప్పారు.

పొత్తులపై ఏకాభిప్రాయం అనేది కష్టసాధ్యమన్నారు. టీడీపీ, బీజేపీలను ఏకతాటిపైకి తేవడానికి ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లాలన్నది తన అభిమతంగా చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదు అంటే మూడో పార్టీల కలయిక అనివార్యమన్నారు. అది ఏ స్థాయిలో అన్నది తానొక్కడినే ప్రతిపాదించలేనని తేల్చేశారు. దీనికి అందరికీ ఆమోదయోగ్యమైన ఏకాభిప్రాయం కావాలన్నారు. ఎన్నికల నాటికి పొత్తులపై స్పష్టత వస్తుందని చెప్పారు. తన వైపు నుంచి క్లియర్ గా ఉన్నానని.. ఇప్పటికే చంద్రబాబును మూడుసార్లు కలిసిన విషయాన్ని గుర్తుచేశారు.

అటు తాను సీఎం పదవి కోరుతుండడంపై కూడా స్పందించారు. కొద్దిరోజుల కిందట వరకూ పదవులతో పనిలేదని.. వైసీపీ విముక్త ఏపీయే లక్ష్యమని పవన్ ప్రకటించారు. ఇప్పుడు అదే విషయంపై ప్రస్తావిస్తూ తాను సీఎం పదవిలో కూర్చోవాలని అభిమానుల ఆకాంక్ష అని.. దానిని తీర్చవలసిన అవసరం తనపై ఉందన్నారు. వారి అభిప్రాయాన్ని గౌరవించి మాత్రమే తాను సీఎంగా ఒక చాన్స్ ఇప్పించాలని కోరినట్టు చెప్పుకొచ్చారు.అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే నేను సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపినట్టు పవన్ చెప్పారు.

సీఎం అని తనవాళ్లు అనుకుంటే సరిపోదని.. అది ప్రజలు కూడా అనుకోవాలని పవన్ అభిప్రాయపడ్డారు. సీఎం పదవి ఒకేసారి వరిస్తుందా.. అంచెలంచెలుగా వస్తుందా అనేది చూడాలన్నారు. కోట్లాది మంది బాధ్యతలు మోసే పదవి కనుక.. దానికి అపారమైన అనుభవం కూడా అవసరమన్నారు. అందుకే తాను నిత్యం ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తున్నట్టు గుర్తుచేశారు. ఎన్నికల్లో ప్రజలు కుల,వర్గాలుగా విడిపోకుండా చూసుకోవాలన్నారు. తమ ఓటు ఉందా? లేదా? అని పరిశీలించుకోవాలన్నారు. చివరి వరకూ కాపాడుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 18 శాతం ఓటు బ్యాంక్ కోల్పోవడం ఖాయమని పవన్ తేల్చిచెప్పారు. మొత్తానికైతే పవన్ పరిణితితో కూడిన వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

BJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP:  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా పాలనా అధికారం కోసం పోటీపడే ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన మెట్టు. ఈ రాష్ట్రం 80 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే అత్యధిక...

Narendra Modi: మోడీ దెబ్బకు మొత్తం మారిపోయింది

Narendra Modi: రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. నిన్నటి వ్యతిరేకులు ఈరోజు స్నేహితులుగా మారడం, వ్యతిరేక పార్టీలు చేతులు కలపడం సాధారణం. లోక్‌సభ, రాజ్యసభ స్వరూపం ఇప్పుడు గత సమావేశాల కంటే చాలా...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....