Homeఅంతర్జాతీయంElon Musk- PM Modi: మోదీ కి కొత్త వీరాభిమాని.... ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కూడా...

Elon Musk- PM Modi: మోదీ కి కొత్త వీరాభిమాని…. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కూడా !.

Elon Musk- PM Modi: ప్రధాని నరేంద్రమోదీ.. విశ్వవేదికలపై ఆయనకు ఉన్న క్రేజే వేరు. ప్రపంచలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి భారతీయులతో మోదీ భేటీ అవుతారు. మరోవైపు మోదీని చూసేందుకు కూడా ఎన్‌ఆర్‌ఐలతోపాటు విదేశీయులు కూడా భారీగా హాజరు కావడం మనం చూస్తున్నాం. మోదీ ప్రసంగం వినేందుకు లక్షల మంది ఎదురు చూస్తుంటారు. ఆకట్టుకునే ప్రసంగం… భారతీయత గొప్పదన్నా సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే వాక్‌చాతుర్యత మోదీ సొంతం. ఇదే సమయంలో భారత దేశంలో పెట్టుబడులను ఆకర్షించ గలుగుతారు. శత్రువునైనా తన మాటలతో ఇట్టే ఆకట్టుకోగల నేర్పరి మోదీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నేత మోదీ. గతంలో ఏ భారత దేశ ప్రధానికి లేనంత క్రేజ్‌ మోదీకి విదేశాల్లో ఉంది. ఎంతోమంది దేశాధినేతలే మోదీకి వంగి వంగి నమస్కరిస్తున్నారు. పసిఫిక్‌ ద్వీప దేశమైన పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్‌ మరాపే ఏకంగా మోదీకి పాదాభివందనం చేశారు. అగ్రదేశాలైన అమెరికా, రష్యా అధినేతలు జో బైడెన్, పుతిన్, బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌ తదితరులు కూడా మోదీ అభిమానులే.

తాజాగా కొత్త అభిమాని..
ప్రధాని మోదీకి తాజాగా ఓ వ్యక్తి కొత్తగా అభిమాని అయ్యారు. ఆయన సామాన్య వ్యక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా కంపెనీ, ట్విట్టర్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌. ఇటీవలే మస్క్‌ ప్రధాని మోదీ ట్విటర్‌ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా అమెరికా పర్యటనకు వెళ్తున్న మోదీని ఆయన కలిసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అమెరికా పర్యటన ఇలా..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు బైడెన్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. టెస్లా సీఈవో, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌తో సమావేశం కానున్నారు. చివరిసారి వీరు 2015లో భేటీ అయ్యారు. అప్పట్లో కాలిఫోర్నియాలోని టెస్లా మోటార్స్‌ ఫ్యాక్టరీని మోదీ సందర్శించారు.

భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు యత్నం..
టెస్లా తన భారత్‌లో కూడా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ తరుణంలో మోదీ, మస్క్‌ మధ్య సమావేశం జరగనుంది. దీంతో వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. భారత మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్‌ తెలిపారు. ఈ ఏడాది చివరి కల్లా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అందుకోసం స్థలాన్ని వెతికే పనిలో ఉన్నామని చెప్పారు.

ప్రముఖులతో భేటీ..
అమెరికా పర్యటనలో అధ్యక్షుడు బైడెన్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ మోదీ భేటీ కానున్నారు. వీరిలో మస్క్‌ సహా పారిశ్రామికవేత్తలు, నోబెల్‌ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యారంగ నిపుణులు ఉన్నారు. అమెరికాలో జరుగుతున్న అభివృద్ధిని అధ్యయనం చేయడం.. ఆయా రంగాల్లో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper