Homeఅంతర్జాతీయంBritain PM Modi: బ్రిటన్ రాజకీయాలను శాసిస్తున్న మోదీ: దెబ్బకు ప్రధాని, హోం మంత్రి రాజీనామా

Britain PM Modi: బ్రిటన్ రాజకీయాలను శాసిస్తున్న మోదీ: దెబ్బకు ప్రధాని, హోం మంత్రి రాజీనామా

Britain PM Modi: భారత ప్రధాని మోదీని కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది ప్రేమిస్తారు. ఎప్పటికీ ఆయన పనితీరును మాత్రం ద్వేషించలేరు. ముఖ్యంగా భారత ప్రయోజనాల విషయంలో ఆయనను ఎవరూ తప్పు పట్ట లేరు. ప్రపంచ మార్కెట్ను శాసిస్తున్నాయి కాబట్టి తలొగ్గి ఉంటున్నారు. లేకుంటే అమెరికా, బ్రిటన్ దేశాలను ఒక ఆట ఆడుకునేవారే. కానీ సమయం చికినప్పుడల్లా భారతదేశానికి వారు చేసిన ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండ గడుతున్నారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని ఆపే సత్తా కేవలం మోదికి మాత్రమే ఉందని సాక్షాత్తు ఉక్రేయిన్ అధ్యక్షుడు ప్రకటించడం.. అమెరికా ఆంక్షలు విధించినా రష్యా నుంచి ముడి చమురు కొనడం.. మోడీ సాధించిన దౌత్య విజయానికి సంకేతాలు. ఇప్పుడు తాజాగా భారత పౌరులను దూషించిన బ్రిటన్ హోం మంత్రిపై మోదీ కన్నెర్ర రద్దు చేశారు. ఆ ఫలితంగా సుదీర్ఘకాలం పాలించిన బ్రిటన్ ఇప్పుడు దెబ్బకు భారత్ కాళ్ల కిందకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

-43 రోజులకే రాజీనామా

సుఏల్లా బ్రవర్మన్ బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో హోమ్ సెక్రటరీ [హోమ్ మంత్రి ] గా పనిచేసింది కేవలం 43 రోజులు మాత్రమే. కానీ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది సుఎల్ల బ్రవర్మన్ ! సెప్టెంబరు 6,2022 న బ్రిటన్ హోం సెక్రటరీ గా ప్రమాణ స్వీకారం చేసింది. సుఎల్లా బ్రవర్మన్. బుధవారం అంటే మొన్న 19,అక్టోబర్ 2022 న రాజీనామా చేసింది. విపరీతమయిన జాతి వివక్ష కలిగిన మనస్తత్వం సుఎల్ల బ్రవర్మన్ ది ! వామపక్ష భావజాలం నిలువెల్లా ఒంటబట్టించుకున్న సుఎల్ల బ్రవర్మన్ మొదటి నుంచి వివాదాస్పద రాజకీయవేత్తగా పరిగణింపబడుతూ వచ్చింది. గత నెలలో జరిగిన ప్రధాని ఎన్నికల పోటీలో సుఎల్లా బ్రవర్మన్ కూడా ఉంది. కానీ రెండో రౌండ్ లోనే పోటీలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది తగినంత మద్దతు లేని కారణంగా ! చివరికి లిజ్ ట్రస్, రుషి శునక్ ల మధ్య పోటీ జరిగింది. చివరకి లిజ్ ట్రస్ ప్రధానిగా గెలిచింది !

-ఇంతకీ సుఎల్లా బ్రవర్మన్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ?

భారతీయులు వీసా గడువు ముగిసిపోయినా ఇంగ్లాండ్ లో ఉండిపోతున్నారు. భారతీయుల వల్ల లండన్ లో గొడవలు జరుగుతున్నాయి ! ఇదీ బ్రిటన్ హోం మంత్రిగా భారతీయులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ! గత నెలలో లండన్ లో జరిగిన భారత్, పాకిస్థాన్ పౌరుల మధ్య జరిగిన అల్లర్ల లో భారతీయులదే తప్పు ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేసింది సుఎల్ల బ్రవర్మన్ ! ఆఫ్కోర్స్ బిబిసి తో పాటు ది గార్డియన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాయి షరా మామూలుగా. అయితే భారత్ బ్రిటన్ ల మధ్య స్వేచ్చా వాణిజ్యం తాలూకు కొన్ని ఒప్పందాలని ఖరారు చేసుకోవడానికి గాను భారత్ ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ లో పర్యటించాల్సి ఉంది. మోడీ పర్యటనలో భాగంగా భారత్ బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా రెండు దేశాలకి సంబంధించి కొన్ని వస్తువులని రెండు దేశాలు ఎలాంటి పన్నులు వేయకుండా ఎగుమతి,దిగుమతి చేసుకోవాలనే దాని మీద సంతకాలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా బ్రిటన్ నుంచి స్కాచ్ విస్కీ ని పన్నులు లేకుండా భారత్ దిగుమతి చేసుకుంటున్నది. దీని ద్వారా బ్రిటన్ కి గణనీయంగా ఆదాయం పెరుగుతున్నది. బదులుగా భారత్ నుంచి పన్నులు లేకుండా కొన్ని వస్తువులని బ్రిటన్ కి ఎగుమతి చేస్తారు. అవి ఏమిటో ఖరారు చేశాక ఇరు దేశాల ప్రధానులు అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తారు. ఈ ఒప్పందాల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇరు దేశాల వాణిజ్య,పారిశ్రామిక వేత్తలు రెండు దేశాలలో స్వేచ్ఛగా ప్రయాణాలు చేయగలుగుతారు. కానీ బ్రిటన్ హోమ్ మంత్రి సుఎల్లా బ్రవర్మన్ మాత్రం ఈ స్వేచ్చా వాణిజ్యం వల్ల బ్రిటన్ లోకి భారతీయుల అక్రమ వలసలు జరుగుతాయి అని వ్యాఖ్యానించింది. దాంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు! దాంతో విస్తు పోయిన బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు, అధికారులు వెంటనే సుఎల్లా బ్రవర్మన్ ని రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారు. అసలే నానాటికీ దిగజారుతున్న బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటే సుఎల్లా బ్రవర్మన్ దానిని వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యల వల్ల గతంలో అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ చేసుకున్న ఒప్పందం తాలూకు ఫలితాలు పొందకుండా చేసినట్లయింది.

అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీవ్రం అయ్యే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో సుఎల్లా బ్రవర్మన్ తన హోమ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ! భారత ప్రధాని బ్రిటన్ పర్యటన రద్దు చేసుకుంటే దాని పర్యవసానంగా ఒక బ్రిటన్ హోమ్ మంత్రి రాజీనామా చేయాల్సివచ్చింది అంటే మామూలు విషయం కాదు.

-భారతే అతిపెద్ద మార్కెట్

ఆసియా లో అతి పెద్ద మార్కెట్ వ్యవస్థలలో భారత్ దే అగ్రస్థానం. చైనా వీలు ఉన్నంతవరకు ఎగుమతులు చేయడానికే మొగ్గు చూపుతుంది కానీ దిగుమతులు భారీగా చేసుకొదు. కాబట్టి భారత్ దే అగ్రస్థానం అనాల్సివస్తున్నది. బ్రిటన్ అధికారులు కూడా భారత్ తో ఫ్రీ ట్రేడ్ ద్వారా ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చు అనే ఆశాభావంతో ఉన్నారు. భారత్ లాంటి అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశాన్ని వదులుకోవడం, అదీ పన్నులు లేని స్వేచ్చా వాణిజ్యం అంటే మాటలు కాదు. రెండు దేశాల వాణిజ్యం విషయంలో సమతూకం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు రెండు దేశాల అధికారులు కాబట్టి మన దేశం నుంచి తక్కువ ఎగుమతులు బ్రిటన్ నుండి ఎక్కువ దిగుమతులు అనే భావన కి చోటు లేకుండా జాగ్రత్త పడ్డారు.కానీ సుఎల్లా బ్రవర్మన్ వ్యాఖ్యతో అది కాస్తా ఆగిపోయింది. వంద సంవత్సరాలుగా బ్రిటన్ స్కాచ్ విస్కీ కి ప్రపంచం మొత్తం మీద డిమాండ్ లేదా ఆదరణ ఉన్నది. కానీ యూరోపియన్ దేశాలలో వేటికవే వాటికి స్వంత బ్రాండ్ల విస్కీ లు ఉన్నాయి కాబట్టి బ్రిటన్ స్కాచ్ , విస్కీ కి అక్కడ మార్కెట్ తక్కువ. భారత్ లో అయితే ఇప్పటివరకు పన్నులతో కలిపి అమ్ముతున్నారు. అదే పన్నులు లేకుండా అయితే అమ్మకాలు ఇంకా పెరుగుతాయి. ఇది బ్రిటన్ కి కలిసి వచ్చే అంశం ! ఒక్క స్కాచ్ విస్కీ నే కాదు ఇతర వస్తువులకి కూడా భారత్ మంచి మార్కెట్ బ్రిటన్ కి ! అందుకే బ్రిటన్ పార్లమెంట్ సభ్యులతో పాటు ఇతర అధికారుల నుంచి సుఎల్లా బ్రవర్మన్ పై ఒత్తిడి పెరిగింది.

-ఇంతకీ ఎవరీ సుఎల్లా బ్రవర్మన్?

సుఎల్లా బ్రవర్మన్ తల్లి దండ్రులలో ఒకరు మారిషస్ ఇంకొకరు కెన్యా నుంచి బ్రిటన్ కి వలస వచ్చి స్థిరపడ్డవాళ్ళే. కానీ మొదటి నుంచి బ్రిటీష్ సామ్రాజ్య వైభోగం గురించి తెగ మాట్లాడేస్తూ ఉండేది. ఆ వైఖరి ఇప్పటికీ పోలేదు. వామపక్ష భావజాలం కూడా భారత్ పట్ల ద్వేషభావాన్ని పెంచి పోషించింది. పరోక్షంగా పాకిస్థాన్ కి అనుకూలంగా ఉంటూ వచ్చింది ఇప్పటి వరకు. గత 43 రోజులుగా బ్రిటన్ హోం మంత్రిగా పనిచేస్తున్నా నిజానికి లిజ్ ట్రస్ ని పక్కనపెట్టి తానే నిర్ణయాలు తీసుకుంటూ పరోక్షంగా ప్రాక్సీ ప్రధానిగా పనిచేసింది సుఎల్లా బ్రవర్మన్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ ? కానీ ఇదే నిజం. లిజ్ ట్రస్ కేవలం ఆట బొమ్మ మాత్రమే. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. లిజ్ ట్రస్ ని కూడా రాజీనామా చేశారు బ్రిటన్ చట్టాల ప్రకారం ప్రధానిగా ఎన్నికఅయిన వ్యక్తి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే కనీసం ఒక సంవత్సరం అన్నా పదవీ కాలం ఉండాలి కానీ లిజ్ ట్రస్ విషయం లో చట్టాన్ని సవరించి అయినా సరే వెంటనే పదవిలో నుంచి పార్లమెంటు సభ్యులు దించేశారు
బహుశా భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రద్దు కావడం వల్లే ట్రస్ మీద ఒత్తిడి పెరిగింది.

బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో బహుశా భారత ప్రధాని నరేంద్ర మోడీ తన బ్రిటన్ పర్యటన షెడ్యూల్ ని ఖరారు చేయవచ్చు. ఒక భారత ప్రధాని బ్రిటన్ రాజకీయాలని శాసిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular