Homeప్రత్యేకండేంజరస్: మరో అరుదైన వ్యాధి.. మంకీపాక్స్ ఎలా వస్తుంది?

డేంజరస్: మరో అరుదైన వ్యాధి.. మంకీపాక్స్ ఎలా వస్తుంది?

Monkeypox Virus

కరోనా వ్యాధి ప్రజలను భయపెడుతున్న క్రమంలో ఇంకా కొత్త కేసులు సైతం వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో దాదాపు 20 ఏళ్ల తరువాత ఓ అదుదైన వ్యాధి వెలుగు చూసింది. ఇటీవల నైజీరియా వెళ్లొచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు ప్రస్తుతం ఆ వ్యక్తి ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి ప్రయాణించిన విమానంలో ఇతర ప్రయాణికుల్ని గుర్తించి వారిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్క కేసే వెలుగులోకి వచ్చింది.

దీంతో ప్రజానీకానికి పెద్ద ప్రమాదమేమీ లేదని తెలిపారు. చివరిసారి 2003లో47 మందికి మంకీపాక్స్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల జూన్ లో బ్రిటన్ లో నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.

సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. ఇది కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి తుంపర్ల ద్వారా సోకుతుంది. వ్యాధి సోకిన వారికి తాకినా మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉంది. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు.

జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట, మంకీపాక్స్ లక్షణాలు. తర్వాత దశలో చర్మం పైన దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా ముఖం, అర చేతులు, అరికాళ్లపై వస్తుంటాయి. దీని ద్వారా విపరీతమైన దురద లేదా నొప్పి కలుగుతాయి. ఒక్కోసారి మచ్చలు కూడా ఏర్పడవచ్చు. ఈ లక్షణాలు 14,-21 రోజుల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఓ వ్యక్తి నుంచి మర వ్యక్తికి వ్యాపించే అవకాశాలు ఉంటాయి.

ప్రస్తుతం మంకీపాక్స్ ను పూర్తిగా నయం చేసే సురక్షితమైన చికిత్స ఏదీ లేదని అమెరికన్ సీడీసీ వెల్లడించింది. అయితే ఈ వైరల్ వ్యాప్తిని అడ్డుకోవడంలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ సహా కొన్ని యాంటీవైరల్ ఔషధాలు ఫలితాలిచ్చినట్లు పేర్కొంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న జనానికి కొత్త వ్యాధి రావడంతో కంగుతింటున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular