Pawan Kalyan CM Seat Pressure: తమిళనాడు రాజకీయాలు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయా?, ఆయన ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవిని అలకరించాలనే వాదన జనసేన పార్టీ క్యాడర్ నుండి రోజురోజుకి ఒత్తిడి పెరుగుతుందా అంటే అవుననే చెప్పాలి. తమిళనాడు లో మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి , ప్రభుత్వాన్ని స్థాపించబోతున్న విజయ్ తో, పవన్ కళ్యాణ్ ని పోల్చి చూస్తూ, ప్రతీ రోజు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వీడియోలు చేయడం గడిచిన నాలుగు రోజుల నుండి సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ కూడా 2024 ఎన్నికల్లో విజయ్ లాగా ఒంటరిగా పోటీ చేసి ఉండుంటే కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడని, అనవసరంగా ఛాన్స్ మిస్ చేసుకున్నదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన ని స్థాపించి 14 ఏళ్ళు కావొస్తుంది, కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నాడు.
కానీ విజయ్ మాత్రం పార్టీ ని స్థాపించిన రెండేళ్లకే ముఖ్యమంత్రి అయిపోయాడు. దీనినే జనసేన పార్టీ క్యాడర్ , అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ముందుకు పోవాలి అనే వ్యూహం కచ్చితంగా సరైనదే , కానీ 2029 లో ఆయన కూటమిగానే ఎన్నికలకు వెళ్లినప్పటికీ , ఎట్టి పరిసిటీలోనే రెండున్నర ఏళ్ళ పాటు సీఎం సీట్ షేర్ నిబంధన తోనే ముందుకు పోవాలని , కనీసం 70 స్థానాల్లో పోటీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆ స్థాయిలో సీట్లు తీసుకుంటారో లేదో తెలియదు కానీ , సీఎం సీటు షేరింగ్ మాత్రం ఈసారికి ఉండాల్సిందే అని , లేదంటే కచ్చితంగా ఈసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరి చంద్రబాబు నాయుడు అందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ కి సీఎం సీటు పై ఎలాంటి మక్కువ లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబే 15 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఆయన. కానీ అభిమానుల నుండి జనసేన పార్టీ కార్యకర్తల నుండి పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అవ్వాలి అనే డిమాండ్ విజయ్ కారణంగా రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ని ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి తరుపున ప్రకటించకపోతే 2024 లో ఎలా అయితే జనసేన నుండి టీడీపీ కి కోస్తాంధ్ర జిల్లాల్లో ఓటు బదిలీ అయ్యిందో , అలా జరిగే అవకాశాలు సూన్యం అనే చెప్పాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జారబోతుంది అనేది.
Chiranjeevi Koratala Shiva Issue: చిరంజీవి – కొరటాల శివ మధ్య ఏం జరిగింది… వీళ్ళిద్దరిలో తప్పెవరిది…
Chiranjeevi Koratala Shiva Issue: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన నుంచి రాబోయే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన భారీ సక్స్ లను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలు భారీ సక్సెస్ లను సాధిస్తాయా? తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని డిజాస్టర్ గా మారాయి. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో చిరంజీవికి భారీ బ్యాడ్ నేమ్ వచ్చింది.
ఈ సినిమా సమయంలో కొరటాల శివకి చిరంజీవికి మధ్య విభేదాలు తలెత్తయని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇక దేవర సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కొరటాల శివ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇతరుల పనుల్లో చేయి పెట్టకపోతే అందరికి మంచిది అంటు కొన్ని కామెంట్లు చేశాడు. కొరటాల చిరంజీవిని ఉద్దేశించే ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేశారు.
ఇక ఏది ఏమైనా కూడా ఆచార్య సినిమా కథలో చిరంజీవి బాగా ఇన్వాల్వ్ అయ్యాడని అందువల్లే ఆ సినిమాను అనుకున్న రీతిలో తీయలేదని కొరటాల శివ తన సన్నిహితుల దగ్గర చెప్పారట… నిజానికి రామ్ చరణ్ క్యారెక్టర్ ఈ మూవీ లో చాలా చిన్నగా ఉండేది. కానీ ఆ క్యారెక్టర్ రామ్ చరణ్ చేస్తున్నాడని చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ ను పెంచడం, కొన్ని విషయాల్లో కొరటాల కాంప్రమైజ్ అవ్వడం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో రాలేదని అందుకే ఫ్లాప్ అయిందని మరి కొంతమంది కూడా చెబుతున్నారు…