Homeవింతలు-విశేషాలుHistorical bravery story: రాజ్యం కోసం తల్లినే ఎదిరించింది.. గుండె ధైర్యం లేనివారు ఈ వీడియో...

Historical bravery story: రాజ్యం కోసం తల్లినే ఎదిరించింది.. గుండె ధైర్యం లేనివారు ఈ వీడియో చూడకండి

Historical bravery story: ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదంటారు. ఎందుకంటే తల్లి అనేక త్యాగాలు చేసి పిల్లల్ని కంటుంది. కనడం మాత్రమే కాదు.. వారిని పెంచి పెద్ద చేస్తుంది. అందుకే తల్లిని త్యాగానికి పర్యాయపదం అంటుంటారు. అటువంటి తల్లి ఈ జంతువు కైనా సరే దైవంతో సమానం. కానీ ఈ జంతువు మాత్రం తల్లిని బద్ద శత్రువుగా చూసింది. చూడడం మాత్రమే కాదు ఏకంగా చంపేంత పనిచేసింది.

మనుషులే కాదు, జంతువులు కూడా గతి తప్పుతున్నాయి. తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తున్నాయి. ఎంతకైనా తెగిస్తున్నాయి. చివరికి కన్న తల్లి విషయంలో కూడా కర్కషంగా వ్యవహరిస్తున్నాయి. చంపడానికి కూడా వెనుకాడటం లేదు. అటువంటిదే ఈ సంఘటన. రాజస్థాన్లోని రణ తంబోర్ నేషనల్ పార్కులో రెండు ఆడ పులులు భీకరంగా పోరాడుకున్నాయి. రాజ్యం కోసం విపరీతంగా యుద్ధం చేశాయి.. ఈ అడవిలో ఆధిపత్యం కోసం కూతురు తల్లితో దారుణంగా పోరాడింది. అటు తల్లి కూడా ఏమాత్రం తగ్గలేదు. కూతురికి మించి పోరాటం చేసింది. అయితే కూతురు ముందు తలవంచింది. హోరాహోరీగా రెండు పులులు పోరాడిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చివరికి తల్లి తట్టుకోలేకపోయింది. కూతురు కోరుకున్నది ఇచ్చేసింది.

అడవుల్లో పులులు వారసత్వాన్ని కొనసాగిస్తుంటాయి. ఆ వారసత్వాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా పోరాటం చేస్తాయి. ఒక్కసారి వారసత్వం లభిస్తే ఆ పరిసర ప్రాంతాల్లోకి మరో పులి రాదు. ఆ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన జంతువుల మీద ఆ వారసత్వ హక్కును దక్కించుకున్న పులికి మాత్రమే అధికారం ఉంటుంది. ఆ పులి మాత్రమే ఆ జంతువులను చంపి తినాలి. మరో పులి ఆ పరిధిలోకి వచ్చి.. వేట సాగిస్తే ఊరుకోదు. వారసత్వ హక్కును దక్కించుకోడాన్ని పులులు గౌరవంగా భావిస్తాయి. దీనికోసం విపరీతమైన పోరాటం చేస్తాయి. చివరికి ప్రాణాలు కోల్పోవడానికి కూడా వెనుకాడవు.

రణతంబోర్ అడవిలో పులుల మధ్య జరిగిన పోరాటం మిగతా వారికి భయంగా అనిపించవచ్చుగాని.. వైల్డ్ లైఫ్ నిపుణులకు అతిపెద్దగా ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే అది సృష్టి ధర్మంలో ఒకటి. ఎందుకంటే వయసు పైబడిన పులులు ఆధిపత్యాన్ని కొనసాగించే హక్కును కోల్పోతాయని యువ పులులు భావిస్తుంటాయి. అందువల్లే ఆధిపత్యాన్ని దక్కించుకోవడానికి అవి పోరాటం సాగిస్తాయి. వీరోచితంగా పోరాటాలు సాగించి ఆధిపత్యాన్ని సొంతం చేసుకుంటాయి. ఆ సమయంలో అవి చేసే పోరాటం అడవిని మొత్తం దద్దరిల్లే విధంగా చేస్తుంది. రణతంబోర్ అడవిలో కూడా ఆ రెండు పులుల మధ్య పోరాటం అదేవిధంగా సాగింది. అడవిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలలో ఈ పోరాటానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper