HomeNewsBigg Boss Telugu 8: క్యారక్టర్ లో గోల్డ్ అని మరోసారి నిరూపించుకున్న పృథ్వీ..స్నేహానికి ఇంత...

Bigg Boss Telugu 8: క్యారక్టర్ లో గోల్డ్ అని మరోసారి నిరూపించుకున్న పృథ్వీ..స్నేహానికి ఇంత విలువ ఇచ్చే కంటెస్టెంట్ ఎవ్వరూ ఉండరేమో!

Bigg Boss Telugu 8: ఈ సీజన్ ఎలాంటి మాస్క్ లేకుండా, చాలా నిజాయితీగా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది పృథ్వీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫిజికల్ టాస్కులలో అప్పుడప్పుడు చాలా అగ్రెసివ్ అవుతాడు, ఎదుటి వ్యక్తి మీద చాలా దారుణంగా అరుస్తాడు అనే ఒక్క కంప్లైంట్ తప్ప, పృథ్వీ కడిగిన ముత్యం లాంటి వాడు, టైటిల్ విన్నింగ్ కి అర్హుడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక మాట ఇచ్చాడంటే, ఆ మాటకు కట్టుబడి, ఏదైనా చేసే మనస్తత్వం ఉన్నవాడు పృథ్వీ. టాస్కులు ఆడుతున్న సమయంలో సింహం లాగ ప్రత్యర్థులపై విరుచుకుపడి, తన టీం ని గెలిపించే పృథ్వీ, ఆ తర్వాత తనకి ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా, కూల్ గా ఉండే తన తత్వానికి లక్షల్లో అభిమానులు ఏర్పడ్డారు. అందుకే ప్రతీ వారం ఆయన నామినేషన్స్ లోకి వస్తున్నప్పటికీ కూడా జనాలు అతన్ని సేవ్ చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే కష్ట సమయాల్లో తన స్నేహితుల కోసం ఇతను నిలబడే తీరుని చూస్తే సెల్యూట్ చేయాల్సిందే. ఒక్కటా రెండా ఎన్నో ఉదాహరణలు ఈ సీజన్ లో ఉన్నాయి. ఉదాహరణకు నిన్న సీత నిఖిల్ పై ‘అమ్మాయిల ఎమోషన్స్ ని నీ ఆట కోసం ఉపయోగించి, వాళ్ళను క్రిందకు లాగేస్తావు, ఇది నీ గేమ్ ప్లే’ అని ఒక దారుణమైన నింద వేసి వెళ్తుంది. దీనికి నిఖిల్ ఎమోషనల్ గా చాలా డల్ అయిపోతాడు, మానసికంగా కృంగిపోతాడు. అప్పుడు పృథ్వీ అతని పక్కనే ఉంటూ, అతనికి ధైర్యం చెప్పిన తీరుని చూస్తే, స్నేహితుడు అంటే ఇలా కదరా ఉండాలి అని ప్రతీ ఒక్కరికి అనిపించింది. ఆ తర్వాత పృథ్వీ నిఖిల్ కి ఒక సలహా ఇస్తూ ‘యష్మీ తో నువ్వు ఈ విషయం గురించి మాట్లాడు. ఆమెను నువ్వు గేమ్ కోసం ఉపయోగించుకోలేదు, ఇది ఆమె నోటి నుండి వస్తేనే జనాల్లోకి వెళ్తుంది’ అని అంటాడు.

అప్పుడు నిఖిల్ రేపు ఉదయం కచ్చితంగా మాట్లాడుతాను ఆమెతో అని అంటాడు. పృథ్వీ చెప్పినట్టుగానే ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడుతాడు నిఖిల్. అప్పుడు యష్మీ హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టి నిఖిల్ తన గేమ్ కోసం, నన్నే కాదు, ఏ అమ్మాయి ఎమోషన్స్ తో కూడా ఆడుకున్నట్టు నాకు అనిపించలేదు, నిన్న సీత ఏ ఉద్దేశ్యంతో అనిందో నాకు తెలియదు కానీ, నిఖిల్ మాత్రం అలాంటి వాడు కాదు. ఈ విషయాన్నీ నిన్ననే నేను చెప్పాలని అనుకున్నాను, కానీ నిఖిల్ గురించి మళ్ళీ స్టాండ్ తీసుకొని మాట్లాడినట్టు ఉంటుందని నేను చెప్పలేదు అని అంటుంది యష్మీ. ఇదంతా పృథ్వీ నిఖిల్ తో ఇలా చేయమని చెప్తేనే జరిగింది. అతనికి హౌస్ లో ఇంతమంచి సలహా పృథ్వీ తప్ప ఎవ్వరూ ఇవ్వలేదు. నిన్న ఆమె అన్నమాటలు హౌస్ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ బ్రదర్ పృథ్వీ చెప్పిన మాటలు విని ఉండిపోయాను అని అంటాడు నిఖిల్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular