ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మతమార్పిడి అర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నామని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. మతమార్పడులను నిరోధించేందుకు యూపీ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను తెచ్చింది. దీనికి గవర్నర్ శనివారం ఆమోద ముద్ర వేశారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ మతమార్పడి ఆర్డినెన్సకు బదులు వ్యవసాయోత్పత్తుల సేకరణ కోసం, యువత ఉద్యోగాల కోసం ఆర్డినెన్స్ తెస్తే అందరికీ ప్రయోజనం ఉంటుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ పై ఆందోళన చేస్తామన్నారు. ముస్లిం యువకులు ఉద్దేశపూర్వకంగా హిందు యువతుల మతం మారుస్తున్నారని గతంలో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ అర్డినెన్స్ ను తీసుకొచ్చారు. దీని ప్రకారం బలవంతంగా మతమార్పడి చేస్తే మూడేళ్ల జైలుశిక్ష పడనుంది.