ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని బహ్రయిచ్ జిల్లాలో రెండు వాహనాలు ఢీకొట్టగా ఆరుగురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా లఖిమ్ పూర్ ఖేర్ జిల్లా నయాపూర్వ ఉమ్రా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. అంబేద్కర్ నగర్ జిల్లాలోని దర్గా కిచ్చౌరా షరీఫ్ ను దర్శించుకునేందుకు ఉమ్రాఖేర్ నుంచి ఓ వాహనంలో బయలు దేరగా బహ్రయిచ్ జిల్లాలోని శివదహ వద్ద ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.