కేరళలోని శబరిమలై ఆలయం తలుపులు శుక్రవారం తెరుచుకోనున్నాయి. శుక్రవారం నుంచి ఐదురోజుల పాటు తెరిచి ఉంచనున్నారు. కరోనా కారణంగా రోజుకు కేవలం 250 మందికి మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. ఎవరు ముందు వస్తే వారికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి భక్తులు నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని దేవస్థానం బోర్డు అధికారులు స్పష్టం చేశారు. కాగా.. ఇటీవల కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. అంతకుముందు కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు రోజుకు వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వెళ్లే అవకాశం ఉంది.