
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 36,604 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 501 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 94,99,414గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,38,122కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,28,644 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 89,32,647 గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 94 లక్షల కేసులు దాటాయి. గత 24 గంటల్లో 43,062 మంది డిశ్చార్జి అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.