
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 36,594 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 540 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 95,71,559గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,39,188కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,16,082 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 90,16,289 గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 95 లక్షల కేసులు దాటాయి. గత 24 గంటల్లో 43,916 మంది డిశ్చార్జి అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.