ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన గురుగావ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయంసింగ్ యాదవ్కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, అయితే జాగ్రత్త చర్యల్లో భాగంగ బుధవారం పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ములాయం సింగ్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా ట్వీట్ చేశారు. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ ఆరోగ్య బాగోగులను చూసుకుంటున్నామని అఖిలేశ్ ట్వీట్ చేశారు.