babri
బాబ్రీ కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 28 ఏళ్ల పాటు విచారణ జరిగిన ఈ కేసులో నిందితులందరినీ లక్నౌవ్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. దీంతో సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే తీర్పు వెల్లడించిన జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్కు పారామిలటరీ భద్రతను కేటాయించారు.
Also Read: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు