
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,722 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,50,273 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 579 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,14,610కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 7,72,055 యాక్టివ్ కేసులు ఉండగా.. 66,63,608 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా రికవరీ రేడు 88.26 శాతం ఉండగా మరణాల రేటు 1.52 శాతంగా ఉంది.