
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 717 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,20,527కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6,03,687 యాక్టివ్ కేసులు ఉండగా.. 73,15,989 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా 24 గంటల్లో 56,480 మంది డిశ్చార్జ్ అయ్యారు.