HomeజాతీయంTVK Vijay Rally Stampede: విజయ్ టీవీకే పార్టీ తొక్కిసలాట.. ఇతడికి 15 రోజుల...

TVK Vijay Rally Stampede: విజయ్ టీవీకే పార్టీ తొక్కిసలాట.. ఇతడికి 15 రోజుల ముందే ఎలా తెలుసు? వెలుగులోకి సంచలన నిజం

TVK Vijay Rally Stampede: టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఏకంగా 39 మంది చనిపోయారు. దాదాపు 100 మంది దాకా గాయపడ్డారు. వీరంతా కూడా కరూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను రప్పించి చికిత్స అందిస్తోంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనం కలిగించింది. పదివేల మంది వస్తారని.. అనుమతి ఇవ్వాలని టీవీ కే పార్టీ ప్రభుత్వాన్ని కోరితే.. అనుమతులు ఇచ్చింది. కానీ ఊహించిన దాని కంటే జనం ఎక్కువగా రావడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఈ ఘటన తర్వాత తమిళ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఒక వార్త మాత్రం ఆసక్తికరంగా ఉంది. టీవీకే పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో జరిగిన తొక్కి సలాట వల్ల 39 మంది చనిపోయిన నేపథ్యంలో.. ఓ వ్యక్తి చేసిన ట్వీట్ సంచలనం కలిగిస్తోంది. ఈ ట్వీట్ అతడు కొద్దిరోజుల ముందు చేశాడు.. సెప్టెంబర్ 13న అతడు ఈ ట్వీట్ చేశాడు..” ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో కనీసం 50 మంది యువత బలయ్యే కనీసం ఒక ఘటనైనా మనం చూస్తాం. డీఎంకే కంటే పది రెట్లు విషపూరితమైన.. క్రూరమైన.. మతిలేని విజయ్ వల్లే ఇదంతా జరుగుతోంది.. దీనివల్ల జరగకూడని దారుణం జరుగుతుంది..” అని ఆనంద్ అనే పేరు గల వ్యక్తి ఈ ట్విట్ చేశాడు. కరూర్ ఘోరం నేపథ్యంలో అతడు చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది. వాస్తవానికి అతడు ఈ ట్వీట్ సాధారణంగా చేశారా.. లేకుంటే పరిణామాలను ముందుగానే ఊహించి చేశారా.. పరిస్థితులను గమనించి ముందుగానే చెప్పారా.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన తర్వాత తమిళనాడు రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ప్రభుత్వం విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తొక్కిసలాటకు విజయ్ బాధ్యుడు కనక.. అతన్ని అరెస్ట్ చేస్తారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయ్ విషపూరితమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నారని.. దానికి నిదర్శనమే ఈ దారుణమని డీఎంకే అనుకూల మీడియా చెబుతోంది. మరోవైపు ఈ ఘటనకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని టీవీకే పార్టీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తమిళనాడు రాజకీయాలలో కరూర్ ఘటన మాయని మచ్చలాగా మిగిలిపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular