Delta Air Lines: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ ను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచనలు చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా రక్షణ పొందే అవకాశంతో పాటు భవిష్యత్తులో కరోనా సోకే అవకాశాలను తగ్గించుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సైతం కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటే మంచిది.
కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వారికి డెల్టా ఎయిర్లైన్స్ కంపెనీ ప్రతి నెలా వేతనం నుంచి రూ.14,831 కట్ చేయనుంది. కంపెనీ హెల్త్ ప్లాన్ లో భాగంగా ఈ విధంగా వేతనం నుంచి డబ్బులను కట్ చేస్తుండటం గమనార్హం. అందువల్ల ఉద్యోగులు వీలైనంత వేగంగా కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. త్వరలో ఇతర కంపెనీలు సైతం ఇదే దారిలో పయనించే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని కంపెనీలు వేతనం కట్ చేయకపోయినా షరతులు విధించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఉద్యోగులు కూడా వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటే మంచిది. నిపుణులు థర్డ్ వేవ్ ముప్పు కూడా ఉండవచ్చని చెబుతున్నారు.
భవిష్యత్తులో కరోనా కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందే అవకాశాలు అయితే ఉంటాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More