Poverty: ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. కష్టనష్టాలు కలుగుతుంటాయి. కానీ ఎప్పటికైనా నిజయితీగా ఉండడమే ఉత్తమం.. అని కొందరు ధర్మోపదేశం చేస్తారు. నిజాయితీ ఉంటూ సక్రమమైన మార్గంలో నడిచినప్పుడే అసలైన జీవితం అంటారు. ఈ క్రమంలో అపర చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలను కొందరు ఫాలో అవుతూ ఉంటారు. మానవుడు కొన్ని లక్షణాలు అలవరుచుకుంటే జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తాడని చాణక్యుడు చెప్పారు. ముఖ్యంగా పేదరికాన్ని జయించాలనుకునేవారు కొన్ని సూత్రాలను తప్పకుండా పాటించాలంటున్నారు. వీరిలో స్త్రీ, పురుషులు ఎవరైనా తమలో ఉండే గుణాలను మార్చుకోవడం ద్వారా పేదరికం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.
కొందరు 20 గంటల పాటు కష్టపడి సంపాదిస్తుంటారు. నిద్రాహారాల గురించి ఆలోచించరు. అయితే వారు ఎంత సంపాదించినా వచ్చిన డబ్బును సక్రమంగా వినియోగించకుంటే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా డబ్బు వృథా అవుతుంది. దీంతో ఆర్థిక లోటు ఏర్పడి పేదరికానికి దారి తీయొచ్చు. అందువల్ల వచ్చిన డబ్బును దుర్వినియోగం చేయకుండా అవసరానికి మాత్రమే ఖర్చుపెడుతూ ఉండాలి. అప్పుడే పేదరికాన్ని జయించవచ్చు.
విద్యా ప్రమాణాలు మానవ జీవితాన్ని చక్కబెడుతాయి. డబ్బు ఎంతో ఖర్చుపెట్టి పెద్ద పెద్ద చదువులు చదువుతారు. కానీ జ్ఓనాన్ని పొందలేరు. సరైన నైపుణ్యం లేని వారు ఎందుులోనూ రాణించలేరు. ఉద్యోగం,వ్యాపారం ఏదైనా సక్సెస్ కావాలంటే ముందుగా జ్ఒానాన్ని సంపాదించాలి. ఇలా నేర్పును సాధించి డబ్బు సంపాదించి వాటిని సక్రమ మార్గంలో వినియోగించాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది.
ఆడవాళ్లలో ప్రధానంగా కోపం ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. ఆడవారికి కోపం ఎక్కువగా ఉండడం వల్ల అన్నీ అనర్థాలే. ముఖ్యంగా పెళ్లయిన వారిలో ఆడవాళ్లకు కోపం ఉండడం వల్ల నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. వీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఇంట్లో ఎటువంటి గొడవలు జరగవు. అయితే కొన్ని విషయాల్లో వాదించడం తప్పు కాదు. ఇల్లు ప్రశాంతంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటూ సత్సంబంధాలను కలిగి ఉంటారు. ఫలితంగా భర్త తన విధులను సక్రమంగా నిర్వర్తించి డబ్బు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది.