
Smriti Mandana Royal Challengers Bangalore : మహిళల ఐపీఎల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగానే సిద్ధమవుతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం టీం ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన కు భారీ మొత్తం(3.4 కోట్లు) చెల్లించి జట్టులోకి తీసుకుంది.. ఇప్పుడు ఏకంగా తన జట్టుకు కెప్టెన్ ను చేసింది. అయితే వేలంలో ఆర్సిబి ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసినప్పుడు ఆమెనే కెప్టెన్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఆమెతోపాటు ఎలీస్ ఫెర్రీని కూడా కొనుగోలు చేసింది.
దీంతో వీళ్ళిద్దరిలోనే ఒకరిని కెప్టెన్ చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు.. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే జట్టు స్మృతి వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే ఒకప్పటి ఆర్సిబి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ డూప్లెసెస్ ఇద్దరూ కలిసి స్మృతిని కెప్టెన్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం కెప్టెన్ ఎవరైనా సరే తాము ఎలీస్ ను చూస్తామని తేల్చి చెప్పారు.
వాస్తవానికి డబ్ల్యూపీఎల్ వేలంలో స్మృతి మందాన కోసం గట్టి పోటీ నెలకొంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆమె కోసం చివరి వరకు పోరాడాయి. కనివిని ఎరుగని రీతిలో భారీ మొత్తాన్ని చెల్లించిన బెంగళూరు… తన జట్టులోకి ఆమెను తీసుకుంది. మనలోనే తాజాగా ఆమెను జట్టు కెప్టెన్ గా ఎంపిక చేసినట్టు ఆర్ సిబి వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. విరాట్ కోహ్లీ వల్ల కానిది, డు ప్లేసిస్ చేయలేనిది… స్మృతి సాధిస్తుందా? ఏమో వేచి చూడాలి.
From one No. 18 to another, from one skipper to another, Virat Kohli and Faf du Plessis announce RCB’s captain for the Women’s Premier League – Smriti Mandhana. #PlayBold #WPL2023 #CaptainSmriti @mandhana_smriti pic.twitter.com/sqmKnJePPu
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 18, 2023