Insects In Pulses: పప్పులకు పురుగులు పడుతున్నాయా? అయితే ఇదిగో పరిష్కారం..

కొన్ని పప్పులకు త్వరగా పురుగు పడుతుంది. అందులో మినపప్పు, శనగ పప్పు ఒకటి. వీటికి తేమ కూడా ఎక్కువే. అందుకే స్టోర్ చేసే ముందు బాగా ఎండబెట్టాలి. వీటిని కొన్న తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. అనంతరం కనీసం 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి.

Written By: Swathi, Updated On : May 15, 2024 6:07 pm

Insects In Pulses

Follow us on

Insects In Pulses: కిచెన్ అంటే అన్ని రకాల వస్తువులు ఉంటాయి. అందులో పసుపు నుంచి పప్పుల వరకు అన్నీ ఉండాల్సిందే. మరి వీటిని సరిగా నిల్వ చేయకపోతే పురుగు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పప్పు ధాన్యాలకు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది దోశ, ఇడ్లీ, వడ వంటి టిఫిన్లు చేసుకోవడానికి మినపప్పును ముందే తీసుకొని వచ్చి కిచెన్ లో పెడుతుంటారు. దీన్ని డబ్బాల్లో ఎక్కువ కాలం ఉంచితే, వాటిలో చిన్న పురుగులు, తవిటిపురుగు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శనగలకు కూడా వీటి బెడద ఎక్కువే. వీటికి పురుగులు పట్టకుండా ఫ్రెష్‌గా ఎలా ఉంచుకోవాలో తెలుసుకోండి.

కొన్ని పప్పులకు త్వరగా పురుగు పడుతుంది. అందులో మినపప్పు, శనగ పప్పు ఒకటి. వీటికి తేమ కూడా ఎక్కువే. అందుకే స్టోర్ చేసే ముందు బాగా ఎండబెట్టాలి. వీటిని కొన్న తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. అనంతరం కనీసం 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి. దీంతో వాటిలోని తేమ పూర్తిగా ఆవిరైపోతుంది. మినప్పప్పును లైట్‌గా ఫ్రై చేయడం మంచిది. దీంతో పప్పుకు పురుగులు పట్టవు. వీటిని ఒక గాజు సీసా లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేయాలి. ఆ కంటైనర్‌ లేదా పాత్రను పొడి లేదా చల్లగా ఉండే ప్లేస్ లోనే పెట్టాలి.

శనగ పప్పు, మినప్పప్పుకు పురుగులు పట్టకుండా ఉండాలంటే, స్టోరేజీ కంటైనర్‌లో బిర్యానీ ఆకులు వేయాలి. ఈ ఆకుల వాసన పురుగులను వికర్షిస్తుంది. అలాగే పప్పు తేమను నిలుపుకునేలా చేస్తూ, ఒక మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. పప్పు ధాన్యాలు నిల్వ చేసిన డబ్బాలో ఎండుమిర్చి ముక్కలు చేసి వేయాలి. ఎండు మిర్చి ఒక పురుగుమందు లాగా పనిచేస్తుంది. పప్పులో ఉన్న పురుగులను కూడా ఈ ఎండుమిర్చి చంపుతుంది. ధాన్యాలు, పప్పులు ఏ రకమైనవి అయినా సరే పురుగుల బారిన పడకుండా ఉంచడానికి రెడ్ చిల్లీ మంచి ఔషధంగా పని చేస్తుంది. వీటి వాసనను పురుగులు తట్టుకోలేవు.

డబ్బాల్లో పప్పు నిల్వ చేసేటప్పుడు దాల్చిన చెక్క వేయాలి. దీని వాసనను పురుగులు భరించలేవు కాబట్టి చనిపోతాయి. అంతేకాదు పురుగులు పప్పు ఉన్న చోటుకు రాలేవు. ఇది పప్పు ధాన్యాలకు మంచి రుచిని కూడా ఇస్తుంది, తేమను నిలుపుకునేలా చేస్తుంది.