టీటీడీ ఛైర్మన్ గా నేడు వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. కాగా టీటీడీ ఛైర్మన్ గా ఆయనకు మరోసారి అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం త్వరలో టీటీడీ బోర్డు సభ్యులను నియమిస్తామని ఇటీవల ప్రకటించింది.