కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో నిర్వహించిన చింతాల మునిస్వామి రథోత్సవంలో అపశ్రతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురుకి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.