నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో వైఎస్ షర్మిల పర్యటించారు. బంగారుగడ్డలో ఎండీ సలీం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం హుజూర్ నగర్ లో పర్యటించారు. అయితే షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడారం గ్రామంలో ఇంటికి తాళం వేసి నీలకంఠ సాయి కుటుంబం బయటకు వెళ్లిపోయింది. షర్మిల వస్తున్నారని కావాలనే నీలకంఠ కుటుంబాన్ని టీఆర్ ఎస్ నేతలు తరలించారని వైఎస్సార్టీపీ నేత పిట్టా రాం రెడ్డి ఆరోపించారు. తాళం వేసిన నీలకంఠ ఇంటి ముందే నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు.