
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రికార్ట్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధాననంలో సమావేశం జరుగనుంది.