Written By:
NARESH , Updated On : September 23, 2020 2:28 pm
vasupally
Follow us on
విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ వీడి వైసీపీకి మద్దతు పలికారు. దానికి గల కారణాలను తాజాగా వెల్లడించారు. డైనమిక్ సీఎం వైఎస్ జగన్ విధానాలు నచ్చి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు. 13 ఏళ్లుగా టీడీపీలో ఉన్నానని.. కాంగ్రెస్, టీడీపీ కంటే వైసీపీ పాలన 100 రెట్లు బెటర్ అన్నారు. 14 నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం పేదల కోసం 59వేల కోట్లు ఖర్చు పెట్టిందని..ఇలానే పాలిస్తే 2050 వరకు జగన్ సీఎంగా ఉంటారని.. అందుకే వైసీపీలో చేరుతున్నట్టు వాసుపల్లి గణేష్ తెలిపారు.