దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.06 గంటల సమయంలో సెన్సెక్స్ 62 పాయింట్లు నష్టపోయి 58,217 వద్ద ట్రేడవుతోంది. అటు, నిఫ్టీ కూడా 26 పాయింట్ల నష్టంతో 17,336 వద్ద ట్రేడవుతోంది. ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్, ఎన్టీపీసీ లాభాల్లో ఉండగా.. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో నష్టాల్లో కొనసాగుతున్నాయి.