
స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9.28 గంటల సమయంలో సెన్సెక్స్ 236 పాయింట్ల లాభంతో 52,609వద్ద.. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 15,763 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74,52 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి.