Homeజాతీయ వార్తలుS Jaishankar : నీకు అమెరికా ఫస్ట్ అయితే మాకు ఇండియా ఫస్ట్.. ఇచ్చిపడేసిన జైశంకర్

S Jaishankar : నీకు అమెరికా ఫస్ట్ అయితే మాకు ఇండియా ఫస్ట్.. ఇచ్చిపడేసిన జైశంకర్

S Jaishankar : సింపుల్గా చెప్పాలంటే.. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ కు వంత పాడుతోంది. అమెరికా చరిత్రలో పాకిస్తాన్ ఫేవర్ గా ఉన్న ట్రంప్ లాంటి అధ్యక్షుడిని ఇంతవరకు ప్రపంచం చూడలేదు. ఆ మధ్య మునీర్ పాకిస్తాన్ వెళ్ళాడు. ఏవో రంగురాళ్ల బాక్సులు ఇచ్చాడు. దానికి ట్రంప్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంకేముంది పాకిస్తాన్లో పెట్టుబడులు పెడతాం.. భారీగా తవ్వకాలు జరుపుతాం అని ప్రకటనలు చేశాడు. కానీ ఇంతవరకు ఊదు కాలింది లేదు. పీరి లేచింది లేదు.

కానీ ఇదే అమెరికా ఇప్పుడు భారత్ మీద రకరకాలుగా మాట్లాడుతోంది. అమెరికాలో భారత్ నుంచి వచ్చిన వారు అక్రమంగా ఉంటున్నారని.. అమెరికా దేశస్థులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని.. చీప్ లేబర్గా పనిచేస్తున్నారని.. ఇలా రకరకాల విమర్శలు చేస్తున్నారు . ఆమధ్య అమెరికాలో ఒక రాష్ట్రానికి సంబంధించిన సేనేటర్ ఏకంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి లేకి వ్యాఖ్యలు చేశాడు. అమెరికా వీసాల కోసం గుడికి వెళ్లి రకరకాల పనులు చేస్తారని.. చివరికి బ్లాక్ మ్యాజిక్ కూడా చేపడతారని మండిపడ్డాడు. దీనిపై మన దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే.

అప్పట్లో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు.. అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా చేశాడు. నరేంద్ర మోడీని అమెరికాకు పిలిపించుకొని హౌడీ మోడీ అనే ప్రోగ్రాం నిర్వహించాడు. దానికంటే ముందు ఇంకా రకరకాల కార్యక్రమాలు జరిపాడు. అటువంటి ట్రంప్ ఇప్పుడు భారత్ అంటేనే మండిపడుతున్నాడు. మధ్యమధ్యలో రంగస్థల నాటక కళాకారుడిగా మోడీ అంటే ఇష్టం.. మోడీ నాకు దగ్గర స్నేహితుడు.. భారత్ అంటే ప్రేమ అంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవంలో మాత్రం వేరే ఉంది.

అమెరికాలో స్థిరపడిన భారతీయుల మీద ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది. ఇక రెండోసారి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత అది మరింత పెరిగింది. ఇటీవల రూబియో ఇండియాకు వచ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడింది. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తమకు అమెరికానే ఫస్ట్ ఛాయిస్ అంటూ వ్యాఖ్యానించింది. అక్కడే మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కూడా ఉన్నారు. ఆయన సమయం రాగానే.. సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. మీకు అమెరికా ఫస్ట్ అయితే.. మాకు ఇండియా ఫస్ట్ అంటూ ఓపెన్ గానే కామెంట్ చేశాడు. దీనికి రూబియో ఒకసారిగా షాక్ అయ్యారు. జై శంకర్ నుంచి ఇటువంటి కౌంటర్ వస్తుందని ఊహించలేదు. వాస్తవానికి జై శంకర్ ఫారిన్ ఎఫైర్స్ మినిస్ట్రీ అయిన తర్వాత ఇండియా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఫారిన్ పాలసీలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా విషయంలో భారత్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజా పరిణామం కూడా దానిని నిరూపించింది. జై శంకర్ సాలిడ్ కౌంటర్ ఇవ్వడంతో అమెరికాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల గ్రీన్ కార్డ్ విషయంలో కూడా అమెరికా లేనిపోని షరతులు విధించింది. దీంతో అమెరికా నిపుణులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. గ్రీన్ కార్డుల విషయంలో అమెరికా ఇలాంటి విధానాలకు పాల్పడతాయి వైద్యరగం నుంచి మొదలు పెడితే టెక్నాలజీ వరకు నిపుణులు మొత్తం స్వదేశాలకు వెళ్ళిపోతే అప్పుడు అమెరికా పరిస్థితి బిచ్చం ఎత్తుకునే స్థాయికి దిగజారుతుంది. అదే గనుక జరిగితే అమెరికా ప్రపంచ ఆర్థిక శక్తి జాబితా నుంచి పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చైనా సవాల్ విసురుతోంది. తయారీ రంగంలో సూపర్ శక్తిగా ఎదిగింది. ఇదే విషయాన్ని ఇటీవల ట్రంప్ కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తున్న శైలి కూడా ఎలా ఉందంటే బస్మాసుర హస్తం లాగా ఉంది. అతడి ధోరణి ఇలానే కొనసాగితే అమెరికాను ఎవడూ నాశనం చేయాల్సిన అవసరం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular