
పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ పై 30 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రల్ ధర రూ. 101.84కి చేరింది. అయితే డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ. 89.87 గా ఉన్నది. ఇక ముంబైలో పెట్రోల్ రూ. 107.83, డీజిల్ రూ. 97.45గా ఉన్నది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 105.83, డీజిల్ రూ. 97.96 గా ఉన్నది.