డీజీపీ మహేందర్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. గోరక్షకులను అరెస్ట్ చేయాలంటే ముందు తనని అరెస్ట్ చేయాలని డీజీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియా సమావేశంలో రాజాసింగ్ మాట్లాడుతూ ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి గోరక్షకులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. స్లీపర్ సెల్స్, బాంబు ఫ్యాక్టరీలకు హైదరాబాద్ అడ్డాగా మారుతోందని డీజీపీపై రాజాసింగ్ మండిపడ్డారు.