లాక్ డౌన్ అమలును డీజీపీ మహేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ, బాలానగర్, బోయిన్ పల్లి, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా లాక్ డౌన్ పరిస్థితులను ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసులకు డీజీపీ పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. తాక్ డౌన్ అమలు చేయడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయన్నారు.