కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తి కొవిడ్ కారణంగా నాలుగు రోజుల క్రితం మరణించాడు. కాగా మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది మృతదేహాన్ని స్వయంగా అక్కడి నుంచి తరలించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. దీనిపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్టర్ ద్వారా స్పందించారు. కరోనా సంక్రమరణ భయంతో బంధువులు తమ ప్రియమైన వ్యక్తికి తుది వీడ్కోలు పలికేందుకు సైతం దూరంగా ఉన్నారు.