నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే అంశంపై శనివారం పోలీసు ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాల విక్రయదారులను ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు. నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ, వ్యవసాయశాఖ సంయుక్తంగా కృషి చేయాలని చెప్పారు.