
హుజూరాబాద్ లో అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్ కు బానిసే అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెరాస రూ. కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. హుజూరాబాద్ లో కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడే వ్యక్తి కావాలా అనేది హుజూరాబాద్ ప్రజలే నిర్ణయిస్తారన్నారు.