Minister Ponguleti Srinivas Reddy: కేసీఆర్ పై మంత్రి పొంగులేటి విమర్శలు చేశాడు. బీఆర్ఎస్ ప్రభుత్వ చేపట్టిన కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కామ్ అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ములుగులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల పేరుతో పింక్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారని ధ్వజమెత్తారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని, ఎంతటి వారైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.