
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ఆదివాసి జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను 2022, ఫిబ్రవరి 16నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గల ఆదివాసీ గిరిజన దైవాలు శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.