
పెద్ద పెద్ద కంపెనీలే లక్ష్యంగా హ్యాకింగ్ పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు మరో ప్రముఖ కంపెనీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద బర్గర్ చైన్ మెక్ డానాల్డ్స్ కార్పొరేషన్ కు చెందిన సమాచారం హ్యాకింగ్ గురైందని ఆ కంపెనీ వెల్లడించింది. అమెరికా, కొరియా, తైవాన్ కు వ్యాపార కార్యకలాపాలకు చెందిన సమాచారం తస్కరణకు గురైనట్లు పేర్కొంది. కంపెనీకి చెందిన అంతర్గత భద్రతలో అనధికారిక కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు ఇటీవల నియమించుకున్న కన్సల్టెంట్లు జరిపిన పరిశోధనలో ఈ విషయం బహిర్గతం అయినట్లు కంపెనీ పేర్కొంది.