పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఉన్న కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. చట్టబద్ధమైన నీటి వాటాను తెలంగాణ రానీయట్లేదని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. శ్రీశైలంలో తక్కువ నీరున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేసింది. వారి తీరుతో ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తెలంగాణ చర్యలు రాజ్యంగా విరుద్ధం. కేఆర్ఎంబీ, కేంద్రం ఆదేశాలను తెలంగాణ అమలు చేయడం లేదని ఏపీ ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది.